CM KCR | స్వతంత్ర భారత వజ్రోత్సవ ముగింపు వేడుకలు ఎల్బీ స్టేడియంలో అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. వేడుకలకు రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు హాజరయ్యారు. స్టేడియం వద్దకు వచ్చిన సీఎంకు ప్రజాప్రతినిధులు, అధికారులు ఘన స్వాగతం పలికారు. స్టేడియంలో మొదట మహాత్మా గాంధీకి సీఎం నివాళులర్పించారు. అనంతరం జాతీయ జెండాను ఎగురవేసి, జెండావందనం చేశారు. దేశానికి 75 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా ఈ నెల 8 నుంచి రాష్ట్ర ప్రభుత్వం స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఆదివారంతో వేడుకలు ముగియనుండగా.. పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసింది. ముగింపు వేడుకలకు రాష్ట్రం నలమూలల నుంచి ప్రజాప్రతినిధులు తరలివచ్చారు.