హైదరాబాద్, జనవరి 30: తెలంగాణకు హక్కుగా రావాల్సిన సంస్థలు, నిధులు, చట్టప్రకారం ఏర్పాటు చేయాల్సిన పరిశ్రమలపై రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీకి వెళ్లి ప్రధానిని కలిసినా.. కేంద్ర మంత్రులకు విన్నవించినా.. పోరాటాలు చేసినా ఫలితం కనిపించడం లేదు. ఎన్ని లేఖలు రాసినా కేంద్రం స్పందించడంలేదు. దశాబ్దాలుగా వివక్షకు గురై, సుదీర్ఘ పోరాటాల అనంతరం కొత్త రాష్ట్రంగా అవతరించిన తెలంగాణను ఉదారంగా ఆదుకోవాల్సిన కేంద్రం.. ఏడేండ్లుగా చిన్నచూపు చూస్తున్నది. రాష్ర్టానికి కేంద్రం చేస్తున్న అన్యాయంపై రాష్ట్ర బీజేపీ నాయకులు ఏనాడూ నోరెత్తింది లేదు. బీజేపీ రాష్ట్ర నేతలు తెలంగాణకు చేసిందేంటన్న ప్రశ్నలు గట్టిగానే తలెత్తుతుండటంతో చేసేది లేక కాస్త గొంతు సవరించుకున్నారు. బడ్జెట్ నేపథ్యంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవల రాష్ట్ర బీజేపీ నేతలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్న బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మనోహర్రెడ్డి, కార్యదర్శి ప్రకాశ్రెడ్డి తదితరులు తెలంగాణకు విద్యాసంస్థలు కేటాయించడంతోపాటు రాయితీలు ఇవ్వాలని, కొత్త ప్రాజెక్టులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఇవన్నీ తెలంగాణ ప్రభుత్వం ఎంతోకాలంగా డిమాండ్ చేస్తున్నవే. సొంత పార్టీ నేతలు చేసిన ఈ డిమాండ్ల విషయంలో నిర్మల సానుకూలంగా స్పందిస్తారా? ఈ బడ్జెట్లోనైనా కేటాయింపులు చేస్తారా?
రాష్ట్ర ప్రభుత్వం, టీఆర్ఎస్ ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్న వాటిలో కొన్ని ముఖ్యాంశాలు