ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు స్టాక్ మార్కెట్లోకి కొత్తగా 75 సంస్థలు వచ్చిచేరాయి. ఆయా సంస్థలు నికరంగా రూ.89 వేల కోట్ల నిధులను సమీకరించాయి. వీటిలో టెక్నాలజీ స్టార్టప్లు అత్యధికంగా నిధులను సేకరించాయి. అంతక్రితం ఏడాది ఇదే సమయంలో కేవలం 29 సంస్థలు రూ.14,733 కోట్ల నిధులను సేకరించాయి.