AP News | ఏపీలో పలు మున్సిపల్ చైర్మన్లు, మేయర్ల ఎన్నిక ఉత్కంఠగా సాగింది. హిందూపురం మున్సిపల్ చైర్మన్గా టీడీపీకి చెందిన రమేశ్ ఎన్నికయ్యారు. ఏలూరు, నెల్లూరు డిప్యూటీ మేయర్ స్థానాలను అలాగే బుచ్చిరెడ్డిపాలెం డిప్యూటీ చైర్మన్ పదవులను కూడా టీడీపీ సొంతం చేసుకుంది.
ఉత్కంఠ నడుమ హిందూపురం మున్సిపాలిటీని టీడీపీ కైవసం చేసుకుంది. మున్సిపల్ చైర్మన్గా కౌన్సిలర్లు రమేశ్ ఎన్నికయ్యారు. 40 మంది సభ్యులున్న కౌన్సిల్లో 23 మంది మద్దతు పలకడంతో రమేశ్ విజయం సాధించారు. వైసీపీ అభ్యర్థి లక్ష్మీకి అనుకూలంగా 14 ఓట్లు పడ్డాయి.
ఏలూరులో రెండు డిప్యూటీ మేయర్ పదవులను తెలుగుదేశం పార్టీ ఏకగ్రీవంగా గెలుచుకుంది. ఉమామహేశ్వరరావు, దుర్గాభవానీ డిప్యూటీ మేయర్గా ఎన్నికయ్యారని అధికారులు ప్రకటించారు. ఇక నెల్లూరు డిప్యూటీ మేయర్గా టీడీపీ మద్దతు అభ్యర్థి తహసీన్ ఎన్నికయ్యారు. నెల్లూరు జిల్లాలోని బుచ్చిరెడ్డిపాలెంలో మున్సిపల్ వైస్ చైర్మన్లుగా టీడీపీ మద్దతు అభ్యర్థులు ఎరటపల్లి శికుమార్ రెడ్డి, పటాన్ నస్రిన్ ఎన్నికయ్యారు.
తిరుపతి డిప్యూటీ మేయర్, నందిగామ, మున్సిపల్ చైర్మన్, పిడుగురాళ్ల వైస్ చైర్మన్ ఎన్నిక వాయిదా పడింది. కోరం సరిపోకపోవడంతో ఎన్నికను రేపు ఉదయం 11 గంటలకు వాయిదా వేశారు.