అమరావతి : ఆంధ్రుల పితామహుడు పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా టీడీపీ నాయకులు నివాళి అర్పించారు. ఆంధ్రులకు ప్రత్యేక రాష్ట్రం కోసం జీవితాన్ని ఆయన చేసిన ఆత్మబలిదానం తెలుగు ప్రజలు ఎన్నటికీ మరువరని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు.
ఆంధ్రులకు ప్రత్యేక రాష్ట్రం కోసం.. దళితులకు దేవాలయ ప్రవేశం కల్పించాలని పోరాడిన గొప్ప అభ్యుదయవాదిగా పొట్టి శ్రీరాములని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ గుర్తుచేశారు. పొట్టి శ్రీరామలు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఆయన మాట్లాడుతూ సమస్యల పరిష్కారం కోసం గాంధీ మహాత్ముడు చూపిన అహింసా మార్గంలో పయనించిన మహనీయులని ఆయన ప్రశంసించారు.