Chandrababu | ఏపీ సీఎం వైఎస్ జగన్ మీద దాడి కేసుపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్పందించారు. రాయి దాడి ఘటనతో అధికార వైసీపీ పార్టీ అభాసుపాలైందని విమర్శించారు. నిందితులకు టీడీపీ నేతలతో సంబంధం ఉన్నట్లు ప్రభుత్వం చిత్రీకరిస్తోందని ఆరోపించారు. బోండా ఉమను ఈ కేసులో ఇరికించాలని వైసీపీ కుట్రలు చేస్తోందని విమర్శించారు. ప్రభుత్వంపై వ్యతిరేకత వస్తుండటంతో కుట్రలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నాలుగు రోజులైనా దాడి ఘటనపై పోలీసులు ఎలాంటి ప్రకటన చేయలేదని మండిపడ్డారు.
కొందరు అధికారుల చట్ట వ్యతిరేక పోకడలను సహించే ప్రసక్తే లేదని చంద్రబాబు అన్నారు. అధికార పార్టీ ప్రలోభాలు, ఒత్తిళ్లకు లొంగవద్దని సూచించారు. అధికార దుర్వినియోగంపై ఈసీ కూడా దృష్టి పెట్టాలని కోరారు. ముఖ్యమంత్రికి భద్రత కల్పించలేని అధికారులను విచారణ బాధ్యతల నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు. ఈసీ పర్యవేక్షణలో సమగ్ర విచారణ జరపాలని సూచించారు.