జోగులాంబ గద్వాల : పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో( Parliamentary election) నాగర్కర్నూల్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి డా. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్(RS Praveen Kumar) ప్రచారంలో దూసుకెళ్తున్నారు. సోమవారం గద్వాల పట్టణంలో(Gadwala) గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఆధ్వర్యంలో మార్నింగ్ వాకింగ్ చేస్తూ ప్రచారం నిర్వహించారు. వాకర్లతో మాట్లాడి కారు గుర్తుకు ఓటేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
పొద్దున లేచింది మొదలు ఇల్లిల్లు తిరుగుతూ, అందరిని కలుస్తూ ప్రచారం నిర్వహిస్తున్నారు.
చేసిన అభివృద్ధి పనులు, చేయబోయే కార్యక్రమాలు వివరిస్తూ ఓట్లు అడుగుతున్నారు. ఊరువాడ, చేను, చెలక అనే తేడా లేకుండా అన్ని చోట్లకు వెళ్తూ అందరితో మమేకమవుతూ ప్రత్యర్థులకు అందనంత దూరంలో ప్రచారంలో దూసుకెళ్తున్నారు. తెలంగాణకు న్యాయం జరగలాంటే పార్లమెంట్లో బీఆర్ఎస్ ఎంపీలు ఉండాలన్నారు. తెలంగాణ ప్రజల కోసం పుట్టిన బీఆర్ఎస్ మాత్రమే ప్రజల పక్షాన పోరాడుతుందని ప్రజలకు వివరిస్తూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు.