కొత్తగూడెం సింగరేణి, అక్టోబర్: కేంద్ర ప్రభుత్వం సింగరేణిలోని బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కొత్తగూడెం, రామవరం, మణుగూరు, ఇల్లెందు, టేకులపల్లి, సత్తుపల్లి మండలాల్లో గురువారం టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో కార్మికులు నల్లబ్యాడ్జీలతో నిరసన తెలిపారు. అన్ని విభాగాల్లో కార్మికులు సంబంధిత అధికారులకు వినతి పత్రాలు అందజేశారు. కేంద్ర ప్రభుత్వం గనుల వేలాన్ని విరమించుకోవాలని, లేకపోతే దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.