న్యూఢిల్లీ : దేశీ మార్కెట్తో పాటు విదేశీ మార్కెట్ల కోసం భారత్లో టాటా గ్రూప్ ఐఫోన్ల తయారీ (IPhone Manufacturing) చేపడుతుందని ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ పేర్కొన్నారు. భారత్లో విస్ట్రన్ ఆపరేషన్స్ను టాటా గ్రూప్ టేకోవర్ చేసిన అనంతరం మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. భారత్లో ఎలక్ట్రానిక్స్ మ్యాన్యుఫ్యాక్చరింగ్లో వినూత్న ఒరవడి చోటుచేసుకుందని చెప్పారు.
భారత్ ప్రపంచ ఎలక్ట్రానిక్స్ మ్యాన్చుఫ్యాక్చరింగ్ పవర్హౌస్గా ఎదిగేందుకు ప్రభుత్వం కృషి సాగిస్తోందని అన్నారు. భారత్తో పాటు విదేశీ బ్రాండ్లు, దేశ విదేశీ కస్టమర్లకు సేవలందించేలా భారత్ ఎలక్ట్రానిక్స్ హబ్గా మారుతున్నదని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పీఎల్ఐ స్కీమ్ ద్వారా భారత్ స్మార్ట్ఫోన్ మ్యాన్చుఫ్యాక్చరింగ్, ఎగుమతుల హబ్గా మారిందని మంత్రి వివరించారు.
ఇక భారత్ నుంచి దేశ, విదేశీ మార్కెట్లకు ఐఫోన్ల తయారీని టాటా కంపెనీలు రెండున్నరేండ్లలోనే చేపట్టనున్నాయని ట్విట్టర్ వేదికగా మంత్రి వెల్లడించారు. విస్ట్రన్ ఆపరేషన్స్ను టేకోవర్ చేసిన టాటా టీంకు మంత్రి శుభాకాంక్షలు తెలిపారు.
Read More :