న్యూఢిల్లీ: చంద్రయాన్-3 (Chandrayaan-3) మిషన్కు సంబంధించిన మరో సమాచారాన్ని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) పంచుకున్నది. విక్రమ్ ల్యాండర్ చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండ్ సమయంలో ఉపరితలంపై ఉన్న 2.06 టన్నుల చంద్రుడి మట్టి, ధూళి ఎగజిమ్మినట్లు తెలిపింది. విక్రమ్ ల్యాండర్ దిగిన చంద్రుడి దక్షిణ ధృవం వద్ద 108.4 మీటర్ల మేర అక్కడి మట్టి, ధూళి విస్తరించినట్లు పేర్కొంది.
కాగా, ఒక అద్భుతమైన ధూళి మేఘంగా ఏర్పడిన దీనిని చంద్రయాన్-2 ఆర్బిటర్కు చెందిన ఆర్బిటర్ హై-రిజల్యూషన్ కెమెరా తీసిన చిత్రాల ద్వారా గుర్తించినట్లు ఇస్రో వెల్లడించింది. ఈ మేరకు ఎక్స్లో పోస్ట్ చేసింది. ‘ఆగస్టు 23, 2023న, చంద్రయాన్-3 ల్యాండర్ మాడ్యూల్ చంద్రుడి మట్టి, ధూళితో అద్భుతమైన ‘ఎజెక్టా హాలో’ను ఉత్పత్తి చేసింది. పైకి ఎగసి విస్తరించిన చంద్రుడి ఉపరితల పదార్థం సుమారు 2.06 టన్నులు ఉంటుందని ఎన్ఆర్ఎస్సీ, ఇస్రో శాస్త్రవేత్తలు అంచనా వేశారు. విక్రమ్ ల్యాండర్ ల్యాండింగ్ సైట్ చుట్టూ 108.4 మీటర్ల మేర ఇది విస్తరించింది.’ అని ఇస్రో పేర్కొంది.
Chandrayaan-3 Results:
On August 23, 2023, as it descended, the Chandrayaan-3 Lander Module generated a spectacular ‘ejecta halo’ of lunar material.Scientists from NRSC/ISRO estimate that about 2.06 tonnes of lunar epiregolith were ejected and displaced over an area of 108.4 m²…
— ISRO (@isro) October 27, 2023