న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: దేశీయ ఆటోమొబైల్ దిగ్గజాల్లో ఒకటైన టాటా మోటర్స్..ప్యాసింజర్ వాహనాలకోసం కొత్తగా 160 సర్వీస్ వర్క్షాప్లను ఏర్పాటు చేసింది. దీంతో మొత్తం వర్క్షాప్ల సంఖ్య 705కి చేరుకున్నట్లు సంస్థ బీఎస్ఈకి సమాచారం అందించింది. మరోవైపు, సంస్థ ద్విచక్ర వాహన సర్వీసింగ్ కోసం సరికొత్త సేవలు ఆరంభించింది. ‘ఈజ్సర్వ్’ పేరుతో ప్రారంభించిన ఈ సేవలు ఇంటి వద్దనే బైక్ సర్వీసింగ్ చేసి ఇవ్వనున్నట్లు కంపెనీ వర్గాలు వెల్లడించాయి. దీంతో తొందరగా రిపేర్, తమకు నచ్చిన చోటనే మరమ్మత్తులు చేసి ఇవ్వనున్నది.