వరంగల్ : నిషేధిత ప్లాస్టిక్ వస్తువులు తయారు చేస్తున్న పరిశ్రమపై పొల్యూషన్ బోర్డు అధికారులతో కలిసి వరంగల్ టాస్క్ఫోర్స్ పోలీసులు మెరుపుదాడి చేశారు. ఈ సందర్భంగా రూ.13లక్షల విలువైన ప్లాస్టిక్ గ్లాస్లను స్వాధీనం చేసుకున్నారు. వరంగల్ బల్దియా అధికారులతో కలిసి ఎనుమాముల మార్కెట్ దగ్గరలో ఉమనాగ్ పాలిమర్స్ అనే పరిశ్రమను తనిఖీ చేయగా.. పెద్ద మొత్తంలో ప్లాస్టిక్ గ్లాస్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం యజమానిపై చర్యల కోసం పొల్యూషన్ కంట్రోల్ అధికారులకు అప్పగించారు. తెలంగాణ ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా ప్లాస్టిక్ వస్తువులు వినియోగించడం నేరమని ఏసీపీ జితేందర్ రెడ్డి అన్నారు. అలాగే వస్తువులు తయారు చేసినా కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు.