హైదరాబాద్, ఆట ప్రతినిధి: హైదరాబాద్ నగరం మరో ప్రతిష్ఠాత్మక టోర్నీకి వేదిక కాబోతున్నది. బధిరుల టీ20 ప్రపంచకప్ టోర్నీకి భాగ్యనగరం తొలిసారి ఆతిథ్యమివ్వబోతున్నది.
వచ్చే ఏడాది మే 27 నుంచి జూన్ 7 వరకు ఎల్బీ స్టేడియం, జింఖానా మైదానం వేదికలుగా పొట్టి ప్రపంచకప్ మ్యాచ్లు జరుగనున్నాయి. బ్రౌచర్ను మంగళవారం సాట్స్ చైర్మన్ వెంకటేశ్వర్రెడ్డి, ఏఐసీఏడీ అధ్యక్షుడు కాశ్మీర్సింగ్ ఆవిష్కరించారు.