Loksabha Elections 2024 : లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి వరుస షాక్లు తగులుతున్నాయి. సూరత్ లోక్సభ స్ధానాన్ని పోటీ లేకుండా బీజేపీ కైవసం చేసుకున్న అనంతరం తన నామినేషన్ తిరస్కరణకు గురవడంతో కాంగ్రెస్ అభ్యర్ధి నీలేష్ కుంభానీ కాషాయ పార్టీలో చేరతారని ప్రచారం ఊపందుకుంది.
నీలేష్ బీజేపీ గూటికి చేరతారనే ప్రచారంతో ఆయన ఇంటివద్ద కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ప్రజలను వంచించాడనే పోస్టర్లతో నీలేష్ ఇంటి ఎదుట కాంగ్రెస్ శ్రేణులు భైఠాయించాయి. నాటకీయ పరిణామాల మధ్య సూరత్ లోక్సభ స్ధానం కాషాయ ఖాతాలోకి చేరిపోయింది.
సూరత్లో తొలి కమలం వికసించిందని, ప్రధాని నరేంద్ర మోదీకి దాన్ని బహుకరించామని గుజరాత్ బీజేపీ చీఫ్ సీఆర్ పాటిల్ వ్యాఖ్యానించారు. పోటీ లేకుండా ఎన్నికైన సూరత్ లోక్సభ స్ధానానికి తమ పార్టీ అభ్యర్ధి ముఖేష్ దలాల్ను అభినందిస్తున్నామని ట్విట్టర్ వేదికగా పాటిల్ పేర్కొన్నారు.
Read More :
Salman Khan | సల్మాన్ ఖాన్ ఇంటి దగ్గర కాల్పులు.. తాపీ నదిలో దొరికిన రెండో తుపాకీ.. Video