న్యూఢిల్లీ: తప్పుదోవ పట్టించే ప్రకటనలకు సంబంధించిన కేసులో బహిరంగ క్షమాపణలు చెబుతూ దేశవ్యాప్తంగా 67 పత్రికల్లో ప్రకటనలు ఇచ్చామని పతంజలి సంస్థ మంగళవారం సుప్రీం కోర్టుకు తెలిపింది.
దీనిపై స్పందించిన న్యాయస్థానం.. తప్పుదోవ పట్టించే యాడ్ల సైజ్లోనే, అదే ఫాంట్లో క్షమాపణల ప్రకటనలు ఇచ్చారా? అని ప్రశ్నించింది. రెండు రోజుల్లో పత్రికల్లో ప్రచురితమైన ప్రకటనలను సమర్పించాలని పతంజలి ఎండీ అచార్య బాలకృష్ణ, సంస్థ సహ వ్యవస్థాపకుడు, యోగాగురు బాబా రాందేవ్ను సుప్రీంకోర్టు ఆదేశించింది.