న్యూఢిల్లీ: మహిళలను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) కార్యాలయానికి పిలిచి విచారించే అంశంపై ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్పై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ చేపట్టారు. జస్టిస్ అజయ్ రస్తోగి, జస్టిస్ బేలా ఎం త్రివేది నేతృత్వంలోని ధర్మాసనం ఈ కేసును విచారించింది. తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేస్తున్నట్లు కోర్టు తెలిపింది. ఎమ్మెల్సీ కవిత తరఫున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదనలు వినిపించారు.
మహిళలను ఈడీ ఆఫీసుకు పిలిచి విచారణ జరిపించే విషయంలో గతంలో నళిని చిదంబరం వేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు ట్యాగ్ చేసింది. నిందితురాలు కానప్పుడు విచారణకు ఎలా పిలుస్తారని కపిల్ సిబల్ ప్రశ్నించారు. ఎమ్మెల్సీ కవితకు ఇచ్చిన ఈడీ సమన్లను రద్దు చేయాలని, ఇంటి వద్దే విచారణ జరపాలని ఆయన కోరారు.