మక్తల్టౌన్, అక్టోబర్ 16 : బడుగుల జీవితాల్లో వెలుగులు నింపి సంక్షేమాభివృద్ధి కి తోడ్పాటునందించాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ మ్యానిఫెస్టో విడుదల చేశారని మ క్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి తెలిపారు. మాగనూర్ మాజీ వైస్ ఎంపీపీ ఆంజనేయులు ఆధ్వర్యంలో సోమవారం అడవి సత్యారం గ్రామానికి చెందిన 30 మంది నాయకులు మక్తల్ పట్టణంలోని ఎమ్మెల్యే చిట్టెం సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో ఆగమైన తెలంగాణను.. సీఎం కేసీఆర్ అభివృద్ధి పథంలో పయనించేలా చేశారన్నారు. ఎందరో మేధావులను ఒక తాటిపైకి తెచ్చి, వారి ఆలోచనలకు అనుగుణంగా ప్రజలకు సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారన్నారు. సీఎం కేసీఆర్ మాట ఇచ్చారంటే కచ్చితంగా నెరవేరుస్తారన్నారు. పార్టీలో చేరిన కార్యకర్తలకు కొత్త, పాత అనే తేడాలేకుండా అందరికీ సముచిత స్థానం కల్పిస్తామన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు.
శంకరలింగేశ్వర స్వామి ఆలయంలో పూజలు..
ఊట్కూర్, అక్టోబర్ 16 : మండలంలోని కర్ణాటక సరిహద్దులో ఉన్న ఇడ్లూరు శంకరలింగేశ్వర స్వామి ఆలయాన్ని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి దర్శించుకున్నారు. స్వామివారికి పూలు, పండ్లు, నైవేద్యం సమర్పించి పూజలు చేశారు. ఎమ్మెల్యే రాకను తెలుసుకున్న బీఆర్ఎస్ నాయకులు భారీగా తరలివచ్చి మద్దతు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ లక్ష్మి, జెడ్పీటీసీ అశోక్కుమార్గౌడ్, పీఏసీసీఎస్ చైర్మన్ బాల్రెడ్డి, సర్పంచులు సూర్యప్రకాశ్రెడ్డి, సరోజ, పాపమ్మ, నాయకులు అరవింద్కుమార్, సుధాకర్రెడ్డి, లక్ష్మారెడ్డి, విజయసింహారెడ్డి, సురేశ్, ఎల్లప్ప, భాస్కర్రెడ్డి పాల్గొన్నారు.