Sunil Gavaskar : వెస్టిండీస్ పర్యటన(Westindies Tour)కు బీసీసీఐ యువకులను ఎంపి చేసింది. దాంతో, ఈ టూర్పై ఆశలు పెట్టుకున్న కొందరికి నిరాశే మిగిలింది. వీళ్లలో భారత జట్టు భావి తారగా మాజీలచే ప్రశంసలు అందుకున్న అర్ష్దీప్ సింగ్(Arshdeep Singh) ఒకడు. టెస్టు, వన్డే జట్టు.. రెండింటిలోకూడా ఈ యంగ్ బౌలర్ను సెలెక్ట్ చేయలేదు. జట్టులో చోటు కోల్పయిన అతడికి మాజీ క్రికెటర్ సునీల్ గావస్కర్(Sunil Gavaskar) బాసటగా నిలిచాడు. ‘టీ20 బౌలర్గా వచ్చిన జస్ప్రీత్ బుమ్రా ఇప్పుడు జట్టులో కీలక పేసర్గా మారాడు. అతడిలానే అర్ష్దీప్ సింగ్ కూడా అన్ని ఫార్మాట్లలో టీమిండియాకు ప్రధాన బౌలర్ అవుతాడు.
ఈమధ్యే అతను కౌంటీ క్రికెట్లో ఇంగ్లండ్పై సత్తా చాటాడు. అయితే.. ఒక్కోసారి జట్టులో చోటు కోల్పోవడం మంచికే జరుగుతుంది. ముఖ్యంగా బౌలర్లు దేశవాళీలో ఎక్కువ వికెట్లు తీయొచ్చు. ఇప్పుడు అర్ష్దీప్ సింగ్ చేయాల్సింది అదే. అతను వరుసగా 5 వికెట్ల ప్రదర్శన చేయాలి. అలా చేస్తే ఈ లెఫ్ట్ ఆర్మ్ పేసర్ మళ్లీ జట్టులోకి వస్తాడు’ అని గావస్కర్ తెలిపాడు.
విండీస్ పర్యటనకు నయా వాల్ ఛటేశ్వర్ పూజారా(Chateshwar Pujara)పై వేటు సమంజసం కాదని గావస్కర్ అన్నాడు. సోషల్మీడియాలో లక్షల్లో ఫాలోవర్స్ లేనంత మాత్రాన అతడిని తొలగిస్తారా? అని సెలెక్టర్లను ప్రశ్నించాడు. ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్లో(WTC Final 2023) పుజారా తీవ్రంగా నిరాశ పరిచాడు. రెండు ఇన్నింగ్స్ల్లో తక్కువ స్కోర్కే పెవిలియన్ చేరాడు.
ఛటేశ్వర్ పూజారా
దాంతో, సెలెక్టర్లు అతడికి ఉద్వాసన పలికారు. జట్టులో చోటు దక్కకపోవడంతో పూజారా కీలక నిర్ణయం తీసుకున్నాడు. దులీప్ ట్రోఫీ(Duleep Trophy)లో పరుగులు సాధించి తన సత్తా నిరూపించుకోవాలని అనుకుంటున్నాడు. సూర్యకుమార్ యాదవ్ కూడా అతడితో కలిసి వెస్ట్ జోన్కు ఆడనున్నాడు. విండీస్ టూర్లో భారత జట్టు రెండు టెస్టులు, మూడు వన్డేలు, 5 టీ20లు ఆడుతుంది. మొదటి టెస్టు జూలై 12న మొదలవ్వనుంది.