పెద్దమనసు చాటుకున్న చిన్నారి శాలిని..
హుజూరాబాద్ : హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పేదింటి బిడ్డ గెల్లు శ్రీనివాస్ యాదవ్కు ఎన్నికల ఖర్చుకోసం చందాలు ఇచ్చి పలువురు తమ పెద్ద మనసు చాటుకుంటున్నారు.
గురువారం హుజూరాబాద్ మండలం పెద్దపాపయ్యపల్లిలో మంత్రి హరీశ్రావుతో కలిసి ప్రచానికి వచ్చిన అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్కు అదే గ్రామానికి చెందిన జిన్నారపు శాలిని అనే చిన్నారి తన పుట్టిన రోజు కోసం దాచుకున్న రూ.500 ను ప్రచార ఖర్చులకు బహుమతిగా అందజేసింది.
దీంతో చిన్నారిని మంత్రి హరీశ్రావు అభినందించారు. అలాగే, ఇదే గ్రామానికి చెందిన తెలంగాణ ఉద్యమ నాయకులు రాం, తిరుపతి రూ.10వేలు, చిన్నపాపయ్యపల్లి యాదవ సంఘం వారు రూ.10వేలు, గొరెపిల్ల అందజేశారు.
సిర్సపల్లి గ్రామంలోను…
అలాగే మండలంలోని సిర్సపల్లి గ్రామస్తులు కూడా గెల్లుకు ఎన్నికల ప్రచారం కోసం చందాలు ఇచ్చారు. గ్రామానికి చెందిన తూముల చొక్కారావు రూ. 10 వేలు, జి. మధుకర్ రావు, గొర్ల మురళి, పి. రామారావుతో పాటు మరొకరు రూ. ఐదువేల చొప్పున అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ కు మంత్రి హరీష్ రావు చేతుల మీదుగా అందజేశారు.
కాగా నిరుపేద కుటుంబానికి చెందిన గెల్లు శ్రీనివాస్ గెలుపును ఆకాంక్షిస్తూ గ్రామస్తులు చందాలు ఇవ్వడం తనను కదలించిందని మంత్రి ఈ సందర్బంగా పేర్కొన్నారు