మార్కెట్లో షుగర్ ఫ్రీ మిఠాయిల తాకిడి ఎక్కువే. మధుమేహ రోగులు కూడా తీసుకోవచ్చంటూ ప్రకటనలు గుప్పిస్తున్నారు. కానీ ఆ తీపి వెనుక చేదు నిజాలూ ఉన్నాయి. కొన్నిరకాల కృత్రిమ స్వీట్నర్స్ కారణంగా మానసిక ఒత్తిడి, ఆందోళన అధికం అవుతాయని ఫ్లోరిడా స్టేట్ యూనివర్సిటీ పరిశోధనలో తేలింది.
యాస్పర్టేమ్ అనే కృత్రిమ స్వీట్నర్ కలిపిన పానీయాన్ని ఎలుకలకు రుచి చూపినప్పుడు.. వాటిలో అకారణమైన ఆందోళన కనిపించింది. అందులోని పదార్థాలు కేంద్ర నాడీ వ్యవస్థపై ప్రభావం చూపడమే ఇందుకు కారణం. ఈ అధ్యయనాన్ని ‘ప్రొసీడింగ్స్ ఆఫ్ ద నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్’ జర్నల్లో ప్రచురించారు.