రఘునాథపాలెం/ ఖమ్మం కమాన్బజార్/ మహబూబ్నగర్ కలెక్టరేట్, జూలై 31 : పెండింగ్లో ఉన్న రూ.8 వేల కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని కోరుతూ రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థి సంఘాల నాయకులు శుక్రవారం ధర్నాలు , ర్యాలీలు నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఖమ్మం నగరంలో నిర్వహించిన ర్యాలీలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి నేత రాకేశ్దత్త మాట్లాడుతూ.. రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ను విడుదల చేస్తవా? విద్యాశాఖ మంత్రిగా రాజీనామా చేస్తవా? అంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని ప్రశ్నించారు.
విద్యార్థులు ఆర్డీవో ఆఫీస్లోకి చొచ్చుకెళ్లే ప్రయత్నం చేయగా పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం ఆర్డీవోకు వినతిపత్రాన్ని అందజేశారు. పీడీఎస్యూ ఖమ్మంజిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. మహబూబ్నగర్లోని తెలంగాణ చౌరస్తాలో బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ర్యాలీ చేపట్టారు.