మల్దకల్, మార్చి 21 : ఈతకు వెళ్లి విద్యార్థి మృతి చెందిన ఘటన మండలంలోని ఉల్గెపల్లిలో చోటు చేసుకున్నది. గ్రామస్తుల కథనం మేరకు గ్రామానికి చెందిన బోయ హుస్సేన్ కుమారుడు వీరేందర్ (13) బిజ్వారం జెడ్పీహెచ్ఎస్లో 7వ తరగతి చదువుతున్నాడు. బుధవారం గ్రామంలోని యువకులతో కలిసి సమీపంలోని వ్యవసాయ బావికి ఈత కు వెళ్లా డు. ఈతకు దిగిన వీరేందర్ బావిలోంచి బయటకు రాకపోవడంతో గమనించిన తోటి యు వకులు రాత్రికి గ్రామస్తులకు సమాచారమిచ్చారు. గురువారం ఉదయం గ్రామస్తులు కొం దరు బావి లో వెతికి వీరేందర్ మృతదేహాన్ని బయటకు తీసినట్లు తెలిపారు. ఈ ఘటనపై మృతుడి కుటుంబ సభ్యుల ఫి ర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపా రు. విద్యార్థి మృతి విషయం తె లుసుకున్న హెచ్ఎం, ఉపాధ్యాయులు ఉల్గెపల్లి గ్రా మానికి చేరుకొని నివాళులర్పించారు.