జడ్చర్ల : తెలంగాణ ప్రభుత్వ హయాంలోనే వైద్య రంగానికి పెద్దపీట వేశారని జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు. మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మండలం పెద్ద అదిరాల గ్రామంలో రూ.1.20 కోట్ల వ్యయంతో నిర్మించనున్న ప్రాథమిక ఆరోగ్య కేంద్ర భవనానికి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ వైద్య రంగానికి అధిక నిధులు కేటాయిస్తూ ప్రభుత్వ దవాఖానలను బలోపేతం చేస్తున్నారన్నారు.
పీహెచ్సీ నిర్మాణంతో పెద్ద అదిరాల, చిన్న అదిరాల, కొండెడ్, ఎక్వాయపల్లి, కోడ్గల్ గ్రామాలతో పాటు చుట్టూ ఉన్న తండాల ప్రజలకు వైద్య సహాయం అందుతుందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ప్రభుత్వ దవాఖానల్లో మౌలిక సదుపాయాలు ఎంతో మెరుగుపడ్డాయని పేర్కొన్నారు.