Stock Market | ముంబై, ఏప్రిల్ 26: స్టాక్ మార్కెట్ల వరుస ర్యాలీకి బ్రేక్పడింది. బ్యాంకింగ్, ఆర్థిక, కన్జ్యూమర్ డ్యూరబుల్ రంగ షేర్లలో క్రయవిక్రయాలు జోరుగా సాగడంతో సూచీలు నష్టాల్లోకి జారుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లు మిశ్రమంగా ట్రేడవడం, క్రూడాయిల్ ధరలు భగ్గుమంటుండటం, రూపాయి పతనం, విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు తమ ఇన్వెస్ట్మెంట్లను వెనక్కితీసుకోవడం పతనానికి ఆజ్యంపోసింది.
చివరకు వారాంతం ట్రేడింగ్ ముగిసే సరికి 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ 609.28 పాయింట్లు నష్టపోయి 73,730.16 వద్ద ముగిసింది. ఒక దశలో 722.79 పాయింట్లు నష్టపోయింది. అటు ఎన్ఎస్ఈ నిఫ్టీ 150.40 పాయింట్లు కోల్పోయి 22,419.95 వద్ద స్థిరపడింది.