ముంబై, జూన్ 25: గురువారం భారీలాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు శుక్రవారం లాభాల్లో ప్రారంభమై, కొద్దిసేపటికే భారీ నష్టాల్లోకి వెళ్లాయి. ఊగిసలాడుతున్నాయి. రెండు రోజుల క్రితం సెన్సెక్స్ 53వేల స్థాయిని తాకి కిందకు వచ్చింది. నిన్న దాదాపు 400 పాయింట్లు లాభపడి 52,699.00 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 103.50 (0.66%) పాయింట్లు లాభపడి 15,790.45 పాయింట్ల వద్ద ముగిసింది. ఈరోజు కూడా ప్రారంభంలో ఆ దూకుడు కనిపించినప్పటికీ,ఆ తర్వాత క్షీణించింది. ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడం ప్రభావం చూపింది.