ముంబై: మార్కెట్లు వరుసగా నాలుగో రోజు లాభాల్లో ముగిశాయి. ఈరోజు కూడా లాభాలతోనే ముగిశాయి. సూచీలు ఆల్ టైమ్ గరిష్టాన్ని తాకాయి. సెన్సెక్స్ 53,000 పాయింట్లను దాటగా, నిఫ్టీ 15900కు పైన నిలిచింది.లాభాలతో ప్రారంభమైన మార్కెట్లు ఇవాళ చివరి వరకు అదే లాభాల్లో కొనసాగి, చివరకు సరికొత్త గరిష్టాలను తాకి, ముగిశాయి. మధ్యలో కొన్ని రంగాల షేర్లలో ప్రాఫిట్ బుకింగ్ కనిపించింది.
బుధవారం 52,904 పాయింట్ల వద్ద ముగిసిన సెన్సెక్స్, ఈరోజు 52,968.89 పాయింట్ల వద్ద ప్రారంభమై, 53,266.12 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 52,948.43 పాయింట్ల వద్ద గరిష్టాన్ని తాకింది. నిఫ్టీ 15,872.15 పాయింట్ల వద్ద ప్రారంభమై, 15,952.35 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 15,855.00 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. సెన్సెక్స్ చివరకు 0.48శాతం అంటే 254.80 పాయింట్లు ఎగిసి 53,158.85 పాయింట్ల వద్ద , నిఫ్టీ 70.25 లాభపడి 15,924.20 పాయింట్ల వద్ద ముగిసింది.