ముంబై : దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ 30 షేర్ల సెన్సెక్స్ సూచీ 839 పాయింట్ల లాభంతో 60వేల మార్క్ను చేరుకున్నది. మరోవైపు నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ నిఫ్టీ సూచీ 224 పాయింట్లు పెరిగి 17,895 స్థాయి వద్ద ట్రేడింగ్ మొదలైంది. కొత్త ఆర్థిక సంవత్సరం తొలిరోజైన శుక్రవారం అంతకుముందు స్టాక్ మార్కెట్లు లాభాల్లో కొనసాగాయి. బీఎస్ఈ సెన్సెక్ 708 పాయింట్లు పెరిగి.. 59,277 వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 205 పాయింట్లు లాభపడి 17,670 పాయింట్ల వద్ద ట్రేడింగ్ ముగిసింది. హెచ్డీఎఫ్సీ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ విలీనం చేయనున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో బెంచ్ మార్క్ సూచీలు లాభాలతో మొదలైంది. సెన్సెక్స్-30 షేర్లలో హెచ్డీఎఫ్సీ, హెచ్డీఎఫ్సీ బ్యాంకుల షేర్లు వరుసగా 8 శాతం, 7 శాతం మేర లాభపడ్డాయి. ఆ తర్వాత బజాజ్ ఫైనాన్స్, టైటాన్, టెక్ ఎం, ఏషియన్ పెయింట్స్, హెచ్సీఎల్ టెక్ లాభాల్లో ట్రేడవుతున్నాయి.