హుజురాబాద్టౌన్ : గతంలో ముస్లీం మైనార్టీలను పెద్దగా ఎవరూ పట్టించుకోలేదని, సొంత రాష్ట్రంలో ఇంటి పార్టీగా ఏర్పడిన టీఆర్ఎస్ ప్రభుత్వంలో సీఎం కేసీఆర్ మైనార్టీలకు పెద్ద పీఠవేశాడని, అలాంటి సీఎం కేసీఆర్కు, ఆయన నెలకొల్పిన టీఆర్ఎస్ పార్టీకి ముస్లీం మైనార్టీలు ఉప ఎన్నికల్లో అండగా ఉండి పేదింటి బిడ్డ టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు గెల్లు శ్రీనివాసు యాదవ్ను గెలిపించాలని రాష్ట్ర ముస్లీం మత గురువు మౌలానా తంజుమల్ రహమాన్ సూచించారు.
బుధవారం సాయంత్రం హుజురాబాద్ పట్టణంలోని 17వ వార్డులోని 47వ బూత్లో మత గురువు ఇంటింటా కరపత్రాలు పంచుతూ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాలకు, కుల మతాల కతీతంగా అన్ని సామాజిక వర్గాలకు సంబంధించిన పండుగలను, వేడుకలను, ఉత్సవాలను దేశంలో ఏ రాష్ర్టంలోని ముఖ్యమంత్రి నిర్వహించని విధంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఘనంగా నిర్వహిస్తూ ప్రజల మన్ననలు పొందు తున్నారన్నారు.
నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేయడమే కాక ప్రజలకు గత ఎమ్మెల్యే ఈటల రాజేందర్ చేయని అనేక అభివృద్ధి పనులు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు దగ్గరుండి చేయించి, వర్థింపజేసే సత్తా సీఎంతో కలసి శ్రీనివాసు యాదవ్ కు మాత్రమే ఉందన్నారు. గెల్లు శ్రీనివాస్ గెలిస్తే నియోజకవర్గంలో నిరుపేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కట్టించడం, నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడం జరుగుతుందని ఆయన తెలిపారు.
ప్రజలకు ఎళ్లవేలల అందుబాటులో ఉండి సేవ చేసే సేవాగుణం కలిగిన టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాసు యాదవ్ కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో 17వ వార్డు టీఆర్ఎస్ ఇన్చార్జి ఎండి ఖాళీద్హుస్సేన్, సీనియర్ టీఆర్ఎస్ నాయకులు చంద్రశేఖర్, సర్వర్, జియా, అఫ్జల్, చాంద్, సూరజ్, ఇర్ఫాన్, గోరేజానీ తదితర టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.