హైదరాబాద్, జూన్ 20: గతకొన్నేళ్లుగాఅంతర్జాతీయ యోగాదినోత్సవాన్ని వివిధ దేశాలలోసైతం ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటున్నారు. అయితే, ప్రస్తుత కోవిడ్-19 మహమ్మారి ఎంతో మంది జీవితాలను సమూలంగా మార్చింది. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా ఈ సంవత్సరం ‘ఇంటి వద్దనే యోగా, కుటుంబంతో యోగా’ థీమ్ తో జరుపుకుంటున్నారు. తద్వారా ప్రపంచ వ్యాప్తంగా కుటుంబాలు తమ రోజువారీ జీవితాలలో యోగాను అనుసరించాల్సిన ఆవశ్యకతను వెల్లడించడంతో పాటుగా ఆరోగ్యవంతమైన, విశ్రాంత జీవనశైలి ప్రాముఖ్యతను గురించి చెబుతున్నారు.ఆరోగ్యపరంగా ఫిట్గా ఉండేందుకు అత్యుత్తమ మార్గం అనుసరించడంతో పాటు అందుకు తగినట్లుగా అతిముఖ్యమైన పౌష్టికాహారాన్ని తీసుకోవాల్సిన అవసరం చాలా ఉన్నది.అందుకోసం ఓ గుప్పెడు బాదములను తమ రోజువారీ పోషకాహారంలో చేర్చుకోవడం అందులో తొలి అడుగు. పౌష్టికాహార స్నాకింగ్ అవకాశంగా మాత్రమే అవి నిలువడంతో పాటుగా వాటిని తరచుగా తినడం వల్ల పలు ఆరోగ్య ప్రయోజనాలనూ అందిస్తాయి.
గుండె ఆరోగ్యం మెరుగుపడటం, మధుమేహ నియంత్రణ, బరువు నియంత్రణ, చర్మ ఆరోగ్యం మెరుగుపరచడంతో పాటుగా రోగ నిరోధక వ్యవస్థనూ ఆరోగ్యంగా ఉంచుతుంది.’ఆరోగ్యవంతమైన జీవనశైలి అనుసరించాల్సిన ఆవశ్యకత గురించి సుప్రసిద్ధ బాలీవుడ్ నటి సోహా అలీఖాన్ మాట్లాడుతూ ‘‘యోగా చేయడం నాకు ఇష్టం. శాస్త్రం, ఆధ్యాత్మికతల సమ్మేళనం యోగా. నేను ప్రతి రోజూ గుప్పెడు బాదములను తీసుకోవడంతోప్రారంభిస్తుంటాను. ఇవి పోషకాలతోపాటు,అవసరమైన శక్తినీ అందిస్తాయని’ అన్నారు.
‘‘ ప్రతి రోజూ మనం నూతన వైవిధ్యాలను గురించి వింటూనే ఉన్నాం. వీటిని కూడా ప్రజలు అనుసరించడానికి ప్రయత్నిస్తున్నారు. టైప్ 2 మధుమేహంతో ఇబ్బందిపడే ఎంతోమంది తమ రోజువారీ వ్యాయామంలో భాగంగా యోగాను చేసుకుంటే మంచి ప్రయోజనం పొందగలుగుతారు. పౌస్తికాహారం విషయంలో తాజా పళ్లు, కూరగాయలు, బాదములు లాంటి నట్స్ను మీ డైట్లో చేర్చుకోవడానికి ప్రయత్నించండి. అధ్యయనాలు వెల్లడించే దాని ప్రకారం… బాదములలో ప్రోటీన్ అధికంగా ఉండటంతో పాటుగా డైటరీ ఫైబర్ కూడా అధికంగా ఉంటుంది. ఇది ఆరోగ్యవంతమైన బ్లడ్ షుగర్ స్థాయి నిర్వహించడంలో సహాయపడటంతో పాటుగా టైప్ 2 మధుమేహంతో బాధపడుతున్న ప్రజలలో బ్లడ్ షుగర్ నియంత్రణకూ తోడ్పడుతుంది. అదే సమయంలో సాధారణంగా ఫాస్టింగ్ ఇన్సులిన్ స్థాయిపై ప్రభావం చూపే కార్బోహైడ్రేట్ ఫుడ్స్పై బ్లడ్ షుగర్ ప్రభావాన్ని సైతం తగ్గిస్తాయి..’’అని అన్నారు.