లఖింపూర్ ఖీరీ, ఫిబ్రవరి 5: వచ్చే లోక్సభ ఎన్నికల్లో కేంద్ర మంత్రి అజయ్ మిశ్రాపై లఖింపూర్ ఖీరీ ఘటనలో చనిపోయిన రైతు కుమారుడు పోటీ చేయబోతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సమాజ్వాదీపార్టీ, కాంగ్రెస్ నుంచి ఆఫర్లు వచ్చినా.. తాను లోక్సభ ఎన్నికల్లోనే పోటీ చేస్తానని రైతు నచ్చతార్ తెని కుమారుడు జగదీప్ సింగ్ స్పష్టం చేశారు. లోక్సభ ఎన్నికల్లో అజయ్మిశ్రాను ఓడించాలనుకొంటున్నానని పార్టీలకు చెప్పారు. కారుతో రైతులను తొక్కించిన లఖింపూర్ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే.