హైదరాబాద్, జూలై 27 (నమస్తే తెలంగాణ): వరద సహాయ చర్యల్లో సీపీఐ పార్టీ శ్రేణులు విస్తృతంగా పాల్గొని ప్రజలను ఆదుకోవాలని రాష్ట్రవ్యాప్తంగా సీపీఐ కార్యకర్తలకు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు పిలుపునిచ్చారు. ప్రభుత్వ సహాయ చర్యలకు సహకరించడంతోపాటు, ఎకడైనా లోటుపాట్లు ఉంటే స్వయంగా సరి చేయాలని కోరారు.
గురువారం హైదరాబాద్లో కూనంనేని విలేకరులతో మాట్లాడుతూ.. భారీ వర్షాలతో ఇబ్బందులు పడుతున్న ప్రజలను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం సహాయ చర్యలను ముమ్మరం చేయాలని విజ్ఞప్తి చేశారు. కేంద్ర ప్రభుత్వం తక్షణమే నిధులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.