శంషాబాద్ రూరల్, మార్చి 25: త్వరలో శంషాబాద్ ఎయిర్పోర్టు నుంచి కర్నూలుకు విమాన సర్వీసులను ప్రారంభిస్తున్నట్టు జీఎంఆర్ వర్గాలు తెలిపాయి. ఇప్పటికే విజయవాడ, విశాఖపట్నం, తిరుపతికి విమానాలు నడుస్తున్న విషయం తెలిసిందే. కర్నూలుకు కూడా విమాన సౌకర్యాన్ని కల్పించేందుకు వివిధ ఎయిర్లైన్స్లు సిద్ధంగా ఉన్నట్లు జీఎంఆర్ ఉన్నతాధికారులు తెలిపారు.