మెహిదీపట్నం: ఆర్టీసీ బస్సులో మరిచిపోయిన పనిముట్ల బాక్స్ను అధికారులు సదరు వ్యక్తులకు అందజేసిన ఘటన మెహిదీపట్నం డిపోలో జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరుకు చెందిన వెంకన్న తన పనిముట్ల బాక్స్ను మెహిదీపట్నం డిపో ఆర్టీసి బస్సులో మరిచిపోయాడు. ఎల్బీనగర్ ప్రాంతంలో ప్లంబర్గా పని చేసే వెంకన్న శుక్రవారం ఉదయం గుంటూరు నుంచి మెహిదీపట్నం ఆర్టీసి బస్సులో నగరానికి వచ్చాడు. తన పని కోసం రెండు రోజుల క్రితం సుమారు రూ.15 వేలతో పనిముట్లను కొన్నాడు.శుక్రవారం ఉదయం ఎల్బీనగర్ ప్రాంతంలో బస్సు దిగే సమయంలో తన బాక్స్ను మరచిపోయాడు.బాక్స్ను గమనించిన డ్రైవర్ భాస్కర్ డిపోలో అధికారులకు అప్పగించాడు. కొద్ది సేపటి తర్వాత తేరుకున్న వెంకన్న మెహిదీపట్నం డిపో అధికారులను సంప్రదించాడు. అతడి నుంచి వివరాలు తెలుసుకున్న అధికారులు బాక్స్ను అప్పగించారు. ఈ కార్యక్రమంలో డిపో అసిస్టెంట్ మేనేజర్ కృష్ణారెడ్డి,డ్రైవర్ భాస్కర్ ,కంట్రోలర్ సిహెచ్ఎం రెడ్డి,సెక్యూరిటీ కానిస్టేబుల్ కిషన్ తదితరులు పాల్గొన్నారు.