నిజామాబాద్ : శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి ఎస్కేప్గేట్ల ద్వారా గోదావరిలోకి 6వేల క్యూసెక్కుల నీటివిడుదల కొనసాగుతున్నదని ఏఈఈ మాధవి తెలిపారు. ప్రాజెక్టులోకి ఇన్ఫ్లో 6,100 క్యూసెక్కులకు తగ్గిపోవడంతో వరద గేట్లను మూసివేశామన్నారు.
లక్ష్మీ కాలువకు 80 క్యూసెక్కుల నీటివిడుదల కొనసాగుతున్నదన్నారు. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 1091.00 అడుగుల (90.313 టీఎంసీలు) సామర్థ్యం కాగా బుధవారం సాయంత్రానికి అంతేస్థాయిలో ఉందన్నారు.