శ్రీశైలం : ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను శ్రీశైలం దేవస్థానం ఈఓ లవన్న మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా శ్రీశైల మహా క్షేత్రాన్ని అభివృద్ధి చేసేందుకు అవసరమైన ప్రణాళికలను ముఖ్యమంత్రికి వివరించినట్లు లవన్న పేర్కొన్నారు. బుధవారం విజయవాడలోని సచివాలయంలో సీఎం జగన్తో పాటు దేవాదాయశాఖ ప్రధాన కార్యదర్శి వాణిమోహన్, దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ను కలిసి భ్రమరాంబ మల్లికార్జున వార్ల తీర్థ ప్రసాదాలు అందించి.. శేషవస్త్రంతో సత్కరించారు. శ్రీశైల క్షేత్రానికి వచ్చే భక్తులకు మౌలిక వసతుల కల్పనకు సహకారం అందించాలని విజ్ఞప్తి చేసినట్లు లవన్న వివరించారు.