Srisailam | శ్రీశైల మహాక్షేత్రానికి గత 16 రోజుల్లో (ఈ నెల 12 నుంచి 27 వరకు) హుండీల్లో రూ.1,81,485 నగదు విరాళాలు వచ్చాయి. ఆలయంలోని హుండీలను గురువారం కట్టుదిట్టమైన భద్రత మధ్య లెక్కించారు. ఈ విరాళాల్లో 178 అమెరికా డాలర్లు, 20 సౌదీ అరేబియా రియాల్స్, 20, యునైటెడ్ కింగ్ డం పౌండ్లు, ఐదు ఆస్ట్రేలియా డాలర్లు, 100 స్వీడన్ క్రోనర్లు తదితర విదేశీ కరెన్సీ వచ్చింది.
ఈ హుండీలలో వచ్చిన నగదు కానుకను పటిష్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య సీసీటీవీ కెమెరాల నిఘాతో లెక్కించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ఈఓ డీ పెద్దిరాజు, అన్ని విభాగాల యూనిట్ల అధికారులు, పర్యవేక్షకులు, ఆలయ సిబ్బంది, శివ సేవకులు తదితరులు పాల్గొన్నారు.