యాదాద్రి, అక్టోబర్ 3: యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి వారి నిత్యోత్సవాలను సోమవారం అర్చకులు పంచరాత్రాగమశాస్త్రరీతిలో నిర్వహించారు. స్వామి, అమ్మవార్లను తెల్లవారుజామున సుప్రభాత సేవతో మేల్కొలిపి తిరువారాధన నిర్వహించి ఉదయం ఆరగింపు చేశారు. స్వామివారికి నిజాభిషేకం, తులసీ సహస్రనామార్చన, అమ్మవారికి కుంకుమార్చన, ఆంజనేయస్వామికి సహస్రనామార్చన చేపట్టారు. పాతగుట్ట ఆలయంలో ఆర్జిత పూజలు నిర్వహించారు. స్వామివారికి సుదర్శన నారసింహ హోమం ఘనంగా జరిపారు. సుదర్శన ఆళ్వారులను కొలుస్తూ హోమం జరిపారు. స్వామి, అమ్మవార్లను పట్టువస్ర్తాలతో అలంకరించి గజవాహన సేవ నిర్వహించారు. వెలుపలి ప్రాకార మండపంలో తూర్పునకు అభిష్టంగా స్వామి, అమ్మవార్లను వేంచేపు చేసి నిత్య తిరుకల్యాణోత్సవం జరిపించారు. సాయంత్రం తిరువీధి సేవ, దర్బార్ సేవ నిర్వహించారు.