దుండిగల్, ఏప్రిల్ 23: విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన సూరారం ఎస్ఐ నారాయణ సింగ్ సస్పెండ్ అయ్యారు. వివరాలిలా ఉన్నాయి.. సూరారం పోలీస్స్టేషన్ పరిధిలో గత జనవరిలో మహిళ(45)అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఈ కేసును ఎస్ఐ నారాయణసింగ్ దర్యాప్తు చేశారు. అయితే, కేసు దర్యాప్తు పూర్తి చేయకుండానే చేతులు దులుపుకొన్నారు. కాగా, ఇటీవల కేసుకు సంబంధించిన వివరాలను మేడ్చల్ డీసీపీ ఆరా తీసి, రికార్డులను పరిశీలించారు. కేసు విచారణ పూర్తి చేయకుండానే మూసివేసినట్టు డీసీపీ గుర్తించారు. దీనిపై ఎస్ఐ నారాయణసింగ్ను ప్రశ్నించగా.. అతడి నుంచి సరైన సమాధానం రాలేదు. దీంతో అతడిని సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.