అమరావతి : వేసవి సెలవుల సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక వారాంతపు (Special Trains) రైళ్లను నడపనుంది. 07234 నంబర్ గల రైలు ఈనెల 28 నుంచి జూన్ 30వ తేదీ వరకు ప్రతి ఆదివారం సికింద్రాబాద్ నుంచి సంత్రగచి (Santragachi) వరకు నడుస్తుందని విజయవాడ డివిజన్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ మండ్రూకర్ తెలిపారు.
ఈ రైలు రాత్రి 11.40 గంటలకు బయలు దేరి నల్గొండ, మిర్యాలగూడ, నడికుడి, సత్తెనపల్లి, గుంటూరు , విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, అనకాపల్లి (Anakapalli) , విజయనగరం , శ్రీకాకుళం, బరంపూర్, భువనేశ్వర్, కటక్ , ఖరగ్పూర్ మీదుగా మంగళవారం ఉదయం 5 గంటలకు సంత్రగచికి చేరుకుంటుందని వివరించారు.
ఇదే రైలు 07235 నంబర్తో ఈనెల 30వ తేదీ నుంచి జూలై 2 వరకు మంగళవారాల్లో సంత్రగచిలో మధ్యాహ్నం 12.20కు బయలు దేరి బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు సికింద్రాబాద్కు చేరుతుందన్నారు. 18 బోగీలతో నడిచే ఈ రైళ్లలో ఎటువంటి రిజర్వేషన్(Reservation) సౌకర్యం ఉండదని ఆయన వెల్లడించారు. యూటీఎస్ మొబైల్ యాప్ ద్వారా టికెట్లు తీసుకోవచ్చని సూచించారు.