యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి బాలాలయంలో హరిహరులకు సోమవారం ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. కొండ పైన క్యూ కాంఫ్లెక్స్లో వెలిసిన శివుడికి రుద్రాబిషేకం అత్యంత వైభవంగా నిర్వహించారు. ప్రభాత వేళలో మొదటగా గంటన్నర పాటు శివుడ్ని కొలుస్తూ జరిగిన రుద్రాభిషేకంలో భక్తులు మమేకమయ్యారు. ఉదయాన్నే శివుడికి ఆవు పాలు, పంచామృతాలతో అభిషేకించి శివలింగాన్ని అర్చించారు. విభూతితో ఆలంకరించారు.
యాదాద్రీశుడి బాలాలయంలో కవచమూర్తలను సువర్ణ పుష్పాలతో అర్చించిన అర్చకులు మండపంలో ఉత్సవమూర్తుల ను పంచామృతాలతో అభిషేకించి అర్చనలు చేపట్టారు.అనంతరం సుదర్శన నారసింహహోమం,నిత్య తిరుకల్యాణోత్సవం శాస్ర్తోక్తంగా చేపట్టారు. కొండకింద గోశాల వద్ద వ్రతమండపంలో భక్తులు సత్యనారాయణ స్వామి వ్రతాలచరించారు. భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు ఉదయం నుంచే క్యూలు కట్టారు.మొక్కు పూజల్లో భక్తులు మమేకమయ్యారు.