ఇటిక్యాల: మండలంలోని బీచుపల్లి క్షేత్రంలోని జ్ఞాన సరస్వతి ఆలయంలో అమ్మవారి భక్తులు కందాల శ్రీనివాస్ ఆధ్వర్యం లో లక్ష దీపార్చన కార్యక్రమం నిర్వహించారు.అమ్మవారి మొక్కుబడిలో భాగంగా హైదరాబాద్కు చెందిన కందాల శ్రీనివాస్
కుటుంబ సభ్యులు అశ్వయుజ పౌర్ణమి సందర్భంగా అమ్మవారికి లక్ష దీపోత్సవం, సూర్య హోమం, గణపతి హోమం నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా అఖండ భజన భక్తి గీతాలాపన కార్యక్రమాలను నిర్వహించారు.