మల్లాపూర్, నవంబర్ 12: జర్నలిస్టుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయించిందని ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి అన్నారు. శుక్రవారం మల్లాపూర్ ఎస్ఎల్ఎన్ ఫంక్షన్హాల్లో జరిగిన ఉప్పల్ నియోజకవర్గం టీయూడబ్ల్యూజే నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎనుకున్నారు.అర్హూలైన జర్నలిస్టులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు పన్నాల దేవేందర్రెడ్డి, ప్రభుదాస్, టీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు మోతె వెంకట్రెడ్డి, గడ్డమీది బాల్రాజు, నాయకులు మల్కయ్య, బాల్రాజ్, కాప్రా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు కడియాల రమేశ్బాబు, ప్రధాన కార్యదర్శి అశోక్ పాల్గొన్నారు.
నూతన కార్యవర్గం..
టీయూడబ్ల్యూజే ఉప్పల్ నియోజకవర్గం అధ్యక్షుడిగా పల్లా మహేందర్రెడ్డి, కార్యనిర్వాహక అధ్యక్షుడిగా డి.సురేశ్, ప్రధాన కార్యదర్శి సి.శ్రీనివాస్, ఉపాధ్యక్షులుగా పంజాల శ్రీనివాస్గౌడ్, రుద్రగోని నర్సింగ్గౌడ్, రాంప్రసాద్శర్మ, పి.శ్రీనివాస్, కోశాధికారి వేముల శంకర్, సంయుక్త కార్యదర్శులుగా శ్రీనివాస్రావు, చుక్క రమేశ్, కార్యవర్గ సభ్యులు కె.సాంబ, ఏ.విజయ్, సలహదారులుగా కె.చంద్రమౌళి, వి.తిరుపతిరెడ్డి ఎన్నికయ్యారు.