బాన్సువాడ, అక్టోబర్ 29 : బాన్సువాడ డివిజన్ కేంద్రంలోని వీక్లీ మార్కెట్లో సోమవారం కేసీఆర్ సభ నిర్వహించనున్న నేపథ్యంలో సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి, డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్రెడ్డి ఏర్పాట్లను ఆదివారం పరిశీలించారు. ఈ సభకు బాన్సువాడ నియోజకవర్గ నలుమూలల నుంచి లక్ష మంది హాజరుకానున్నారు. ఇందుకోసం పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నారు. బహిరంగ సభ సమీపంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ ఏర్పాటు పనులతోపాటు వాహనాల పార్కింగ్ కోసం ఏర్పాటు చేసిన స్థలాలను పరిశీలించారు.
చివరన కూర్చున్న వారికి కూడా సభా వేదిక కనిపించేలా సీటింగ్ ఏర్పాట్లు చేయాలని స్థానిక నాయకులకు స్పీకర్ పోచారం సూచించారు. సభాపతి వెంట బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు పోచారం సురేందర్ రెడ్డి, రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్ అంజిరెడ్డి, మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్, వైస్ చైర్మన్ షేక్ జుబేర్, బీఆర్ఎస్ పార్టీ మైనార్టీ నాయకులు మహ్మద్ ఎజాస్, వాహబ్, అలీమొద్దీన్ బాబా, దొడ్ల వెంకట్రామ్ రెడ్డి తదితరులు ఉన్నారు.