కార్సన్ (యూఎస్ఏ): ఫిఫా ప్రపంచకప్ తుదిదశకు చేరుకుంటున్న సమయంలో మరో ఆసక్తికర సమరం అభిమానులను అలరించనుంది. అమెరికాపై ఘన విజయం సాధించిన జోష్లో ఉన్న బెల్జియం.. శుక్రవారం అర్ధరాత్రి జరిగే క్వార్టర్స్లో అజేయంగా దూసుకుపోతున్న బలమైన స్పెయిన్తో తలపడనుంది. ప్రిక్వార్టర్స్లో అమెరికాను 4-1 తేడాతో చిత్తు చేసిన బెల్జియం అదే ఊపును కొనసాగించి సెమీస్ చేరాలని పట్టుదలగా ఉంది. మరోవైపు ఈ మెగా టోర్నీలో ఇప్పటివరకు ఒక్క గోల్ కూడా ఇవ్వకుండా.. అజేయంగా నిలిచిన స్పెయిన్ కూడా టైటిల్ దిశగా ముందజ వేయాలని డిసైడైంది.
అయితే గతపోరులో అమెరికాను ఓడించిన తర్వాత బెల్జియం ప్లేయర్లు గ్రౌండ్లో, డ్రెస్సింగ్ రూమ్లో యూఎస్ఏ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుకరించేలా సంబరాలు చేసుకోవడం చర్చనీయాంశమైంది. లాస్ ఏంజెల్స్లోని లొయోలా మేరీమౌంట్ యూనివర్సిటీలో తమకు కేటాయించిన శిక్షణా మైదానాలు కనీస ప్రమాణాలకు అనుగుణంగా లేవని బెల్జియం ఫుట్బాల్ అసోసియేషన్ అసంతృప్తి వ్యక్తం చేసింది. దీంతో ఫిఫా అనుమతితో బుధవారం తమ ప్రాక్టీస్ వేదికను లాస్ ఏంజెల్స్ గెలాక్సీ స్టేడియానికి మార్చుకుంది.