షార్జా: ఆధిక్యం చేతులు మారుతూ సాగిన పోరులో దక్షిణాఫ్రికాను విజయం వరించింది. సూపర్-12 గ్రూప్-1లో భా గంగా జరిగిన ఉత్కంఠ భరిత మ్యాచ్లో దక్షిణాఫ్రికా 4 వికెట్ల తేడాతో శ్రీలంకపై గెలుపొందింది. మొదట బ్యాటింగ్ చేసిన లంక 20 ఓవర్లలో 142 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ పథుమ్ నిశంక (72; 6 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్ధశతకంతో రాణించగా.. మిగిలినవాళ్లు విఫలమయ్యారు. సఫారీ బౌలర్లలో ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’తబ్రేజ్ షంసీ, ప్రెటోరియస్ చెరో మూడు వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో దక్షిణాఫ్రికా 19.5 ఓవర్లలో 6 వికెట్లకు 146 పరుగులు చేసింది. కెప్టెన్ బవుమా (46) ఫర్వాలేదనిపించగా.. చివరి ఓవర్లో దక్షిణాఫ్రికా విజయానికి 15 పరుగులు కావాల్సి ఉండగా.. ‘కిల్లర్’మిల్లర్ (23 నాటౌట్) రెండు భారీ సిక్సర్లతో మ్యాచ్ను ముగించాడు.