ఎదులాపురం, నవంబర్ 25: మరికాసేపట్లో గమ్యస్థానానికి చేరుకోనుండగా, కారులో పాము కనిపించడంతో అందులోని వారు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఆదిలాబా ద్ పట్టణానికి చెందిన ముగ్గురు గురువారం ఉదయం కారులో ఉట్నూర్ వెళ్లారు. సా యంత్రం తిరిగి ఆదిలాబాద్కు బయల్దేరా రు. జిల్లా కేంద్రానికి కిలోమీటరు దూరంలో కారులో ముందు కూర్చున్న వ్యక్తి కాలుకు ఏదో తగిలింది. కిందికి చూడగా పాము కనిపించింది. తీవ్ర భయాందోళనకు గురైన వారు వెంటనే కారును నిలిపి కిందికి దిగారు. అక్కడికి చేరుకున్న ఇతర వాహనదారులు, స్థానికులు కారులోంచి పామును బయటకు తీసి, అడవిలో వదిలేశారు.