లక్నో: ఉత్తరప్రదేశ్లోని మథుర నియోజకవర్గానికి చెందిన బీజేపీ సీనియర్ నేత ఎస్కే శర్మ బీజేపీకి రాజీనామా చేశారు. బీఎస్పీలో చేరారు. అంతకు ముందు పార్టీ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ కోసం ఎంతో కష్టపడ్డానని చెప్పారు. కోట్లాది రూపాయలు ఖర్చు చేసినా తనకు టికెట్ నిరాకరించడం ఆశ్చర్యం కలిగించిందన్నారు. పార్టీ నిర్ణయం తనను తీవ్రంగా కలిచివేసిందని, అందుకే పార్టీలోని అన్ని పదవులకు రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నానని చెప్పారు. ‘బీజేపీ నన్ను మోసం చేసింది’ అని శర్మ పేర్కొన్నారు.