బెంగళూరు: ఏసీ పేలడంతో ఆరుగురు గాయపడ్డారు. కర్ణాటకలోని బళ్లారిలో కల్యాణ్ జ్యువెలర్స్ షోరూంలో గురువారం ఈ ఘటన జరిగింది. ఏసీ పేలడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగి షోరూం అంతా పొగ వ్యాపించింది. ఈ ఘటనలో ఆరుగురికి గాయాలయ్యాయి.
వీరు ప్రస్తుతం దవాఖానలో చికిత్స పొందుతున్నారు. క్షతగాత్రుల్లో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. సెంట్రల్ ఏసీలో గ్యాస్ నింపుతుండగా ఈ ఘటన జరిగినట్టు ప్రాథమికంగా గుర్తించారు. గాయపడ్డ వారిలో ఐదుగురు ఏసీ టెక్నీషియన్లు.