లక్నో: కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ (Sonia Gandhi) శుక్రవారం ఉత్తరప్రదేశ్లోని రాయ్బరేలీలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆమె తన కుమారుడ్ని మీకు అప్పగిస్తున్నానని అక్కడి ప్రజలకు తెలిపారు. ‘మీరు నన్ను ఎలా ఆదరించారో రాహుల్ను కూడా అలా ఆదరించండి. ఆయన మిమల్ని నిరాశపర్చడు’ అని అన్నారు. కుమారుడు రాహుల్ గాంధీతోపాటు కుమార్తె ప్రియాంక కూడా ఆమె వెంట ఉన్నారు.
కాగా, ఇందిరా గాంధీ, రాయ్బరేలీ ప్రజలు తనకు నేర్పిన పాఠాలైన అందరినీ గౌరవించడం, బలహీనులను రక్షించడం, ప్రజల హక్కులు, అన్యాయంపై పోరాడడం వంటివి రాహుల్, ప్రియాంకకు తాను నేర్పినట్లు సోనియా గాంధీ తెలిపారు. ‘భయపడొద్దు. మీ పోరాట మూలాలు, సంప్రదాయాలు చాలా లోతైనవి’ అని అన్నారు. అలాగే 2004 నుంచి వరుసగా ఐదుసార్లు తనను ఎంపీగా గెలిపించిన రాయ్బరేలీ ప్రజలకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.
మరోవైపు సోనియా గాంధీ తొలిసారి రాజ్యసభ ఎంపీగా ఎన్నిక కావడంతో ఐదుసార్లు ఆమె ప్రాతినిధ్యం వహించిన రాయ్బరేలీ లోక్సభ స్థానంలో కుమారుడు రాహుల్ గాంధీ తొలిసారి పోటీ చేస్తున్నారు.
मैं आपको अपना बेटा सौंप रही हूं।
: श्रीमती सोनिया गांधी जी
📍 रायबरेली, यूपी pic.twitter.com/5kwxLtM8nt
— Congress (@INCIndia) May 17, 2024