అమరావతి : ఆంధ్రా ఒడిశా సరిహద్దులో ఆరుగురు మావోయిస్టులను ఏపీ పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టయిన వారిలో కీలక వ్యక్తులు ఉన్నట్లు సమాచారం. మావోయిస్ట్ అగ్రనేత ఆర్కే అంగరక్షకులు ఉన్నట్లు తెలుస్తోంది. అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమను హతమార్చిన వారు సైతం పోలీసులు అదుపులో ఉన్నట్లు సమాచారం. ఇవాళ మధ్యాహ్నం ఆంధ్రప్రదేశ్ డీజీపీ గౌతమ్ సవాంగ్ మీడియా సమావేశం నిర్వహించి, మావోయిస్టుల అరెస్ట్కు సంబంధించిన వివరాలు వెల్లడించనున్నట్లు తెలుస్తోంది.